సిగ్గు పడాల...సంబరం చేయాలా...?
వందల ఏళ్ళుగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవాన్ని ఒక్క సారిగా నెల కూల్చుకున్న చర్యని ఏమని వర్ణించాలి. ఎలా జీర్ణించుకోవాలి. మనకు ఎం కావాలి... ఎలా సాధించుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్లో విగ్రహాలను ద్వంసం చేసిన ఘటన కేవలం మన రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారత దేశంలో జరిగిన అనేక దుర్మార్గపు చర్యల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఆటవిక చేష్టలకు పరాకాష్ట. ఎటుపోతున్నాం. ఏమైపోతున్నాం. ఇదేనా మనం నేర్చుకున్న విజ్ఞానం. సంపాదించిన సాంస్కృతిక వైభవం.
మన అమ్మ పాలు తాగి రొమ్మునే కోసేసిన చందం. అన్నం తినే ఎ ఒక్కడు చేయలేని పాశవిక చర్య. ఎవరు ఎలా స్పందించినా, ఏవిధంగా కన్డిన్చినా, జరిగిన ఘోరాన్ని కప్పి పుచ్చలేరు. కేవలం బొమ్మల్ని కుల్చినందుకే అంత రోషం వచ్హిందా అని ప్రశ్నిస్తున్న చవక బారు నేతలు, మీడియా పెద్దల పై జాలేస్తుంది. కేవలం ఆ విగ్రహాలను బొమ్మలుగానే చూస్తున్న వాళ్ళ విజ్ఞత నిస్చేస్తుడ్ని చేస్తోంది.
అన్నమయ్య,కృష్ణ దేవరాయులు, క్షేత్రయ్య, నన్నయ, ఇలా ఒకరేంటి ఎందరో మహానుభావులు మన తెలుగు భాషను, తెలుగు జాతి గౌరవాన్ని, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసారు. వీళ్లా మన కుటిల కాంక్షలకు, చవక బారు రాజకీయ నీచ ప్రయోజనాలకు, బలికావాల్సింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్ని చూస్తూ, వాటిలో జీవిస్తున్నాం. ఓ సారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనసున్న...మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సిగ్గు పడక తప్పదు. మనిషిగా పుట్టిన ప్రతివాడు స్పందించాల్సిన దురదృష్ట సంఘటన.
ఇవన్ని ఉద్యమంలో భాగమే అనే వాడు ఒకడు. మా జీవిత్లతో పోలిస్తే ఇదేన్తా అనేవాడు ఒకడు. ఆ బొమ్మల్లో మావాడు ఒక్కడు కూడా లేడురా, అంటాడు వేరొకడు. ఇలా ఆలోచించే వాళ్ళుపై జాలేస్తుంది.
కేవలం ఒక్క బాబ్రీ మసీదు కూలిచిన రోజుని ఇప్పటికీ, బ్లాక్ డే గా పాటిస్తున్న గొప్పతనం మన జాతిది. కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అరుదైన సమాజం మనది. ఇది ఎ ఒక్కరి వల్లో, ఒక్క ప్రాంతం వారి ప్రతిభాతోనో సాధించుకుంది కాదు. సమిష్టిగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవం.
ఇంకా ఇలాంటి పైశాచిక చర్యలు కట్టి పెట్టాలి. నిన్నటి ఘటన ఒక ప్రాంతం వాళ్ళ వైకరికి నిదర్సనం అనుకుని సర్ది చెప్పుకుందామా... ఇన్నేళ్ళు గడుస్తున్నా ఇంకా వాళ్ళు ఆటవికంగానే బతుకుతున్నారని అనుకుందామా.... ఏదేమైనా...
ఆహా ఓ భారతావని ఎలాంటి భావిభారత పౌరిల్ని కన్నవ మ్మా, నీ భవిష్యతు ఊహించుకుంటే భయం వేస్తోంది.