Monday, February 21, 2011

కసబ్ కి ఉరి శిక్షే కరెక్ట్.....


          ముంబై మారణ కాండకు కారణం అయిన కరడుగట్టిన కసబ్ కు ముంబై హై కోర్ట్ విధించిన మరణ శిక్ష యావత్ భారతావని ముక్త కంట్టం తో సరైనదే అని చెప్పే క్షణం. న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచే అద్భుత తీర్పు. ఇప్పటికే  ఈ విషయంలో చాలా ఆలస్యం చేశాం. దేశ ప్రతిష్టను, సమగ్రతను, శాంతి భద్రతలను చిన్నా భిన్నం చేసిన ఓ కసాయికి సరైన శిక్షనే ముంబై కోర్ట్ విధించింది. ప్రతి భారతీయుడి ఆశ, ఆకాంక్ష ఇదే. భారతీయుల మనో భావాలను దారుణంగా దెబ్బతీసే దారుణ ప్రయత్నానికి ఒడిగట్టిన ఓ పాకి స్తాని తీవ్ర వాదిని ఇన్ని రోజులు పెంచి పోషించడమే మన దౌర్భాగ్యం. 
                        అభం శుభం తెలియని చిన్నారుల్ని... మన దేశంపై ప్రేమతో వచ్చిన విదేశీయుల్ని... మన ఆర్ధిక రాజధాన్ని నామ రూపాలు లేకుండా చేసిన ఓ కసాయికి పడాల్సిన శిక్ష ఎలా వుండాలి. సాక్ష్యాలు కళ్ళముందే వున్నాయి. యావత్ భారతావని దారుణ సిక్షనే కోరుకుంటుంది. ఇప్పటికే చాలా కోల్పోయాం. చాలు. ఇంకా పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేం.
                       నేరానికి తగిన శిక్ష. మన దేశం పై ఎవడైనా వేలేతి చూపితే ఫలితం  ఎంత దారుణంగా ఉంటుందో చూపించే శిక్ష. అసాధారణ శిక్షలలో మన తీర్పు ఇలానే వుండాలి.  తను చేసిన తప్పుకు ఇప్పటికీ పచ్చాతాపం పడని కసబ్ ను వెంటనే ఉరి తియ్యాలి. అయితే మన చట్టాల ప్రకారం... అతను సుప్రీం కోర్ట్ కు వెళ్ళే అవకాసం వుంది. అక్కడ కూడా ఇదే శిక్షను వీలైనంత త్వరగా విధించాలి.ఇది ఓ భారతీయుడిగా నా ఆవేదన..... కొన్ని కోట్ల మంది ఆకాంక్ష...

Friday, February 18, 2011

కాంగ్రెస్ కుటిల రాజకీయం..

      ఘన చరిత్ర మాది. ఎవరైనా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి. మా పార్టీ త్యాగాల మయం. అంటూ ఊదర గొట్టే కాంగ్రెస్ పార్టి చేస్తున్నపనేంటి. అటు కేంద్రం లో ఇటు రాష్ట్రం లో అధికారంలో వుండి, ప్రజలకు, ప్రజాస్వామ్యానికి కట్టుబడి.. సంక్షేమాన్ని కాపాడాల్సిన పార్టి వీధి రౌడీల అడ్డాగా మారిపోయిందా? లేక అధికార ఏవతో, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. తెలంగాణాపై ఓ స్పష్టమైన వైకరిని చెప్పకుండా... రాష్ట్రాన్ని రావణ కాస్ట్టంగా మార్చేస్తోంది. తెలంగాణా తెచ్చేదీ, ఇచ్చేది మేమే అని ప్రగల్బాలు పలికి... అనవసర ఆర్బాటాలకు... అనవసర గంధర గోలానికి కారణ మైన తెలంగాణా కాంగ్రెస్ నేతల వైఖరి కుటిల రాజకీయాలకు అద్దం పడుతుంది. అధిష్టానం పిలుపుతో వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ నేతలు... అక్కడ ఢిల్లీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ... బయట మీడియా ముందు నానా హంగామా చేస్తున్నారు. తెలంగాణా బిల్లు పెట్టడమే లక్ష్యం అంటూ... తెలంగాణా మేమే సాధిస్తాం అంటూ... ప్రజల్ని మభ్య పెట్టె జిమ్మిక్కులు వేస్తున్నారు. అసలు అసెంబ్లీ జరుగుతుంటే వీల్లెందుకు అక్కడకు వెళ్ళాలి. ఇన్నాళ్ళు లేని... గుర్తుకు రాని వ్యవహారం ఇప్పుడే వచ్చిందా. 
                                       రెండు నాల్కల ధోరణితో సగటు మనిషిని దారుణంగా వాడుకుంటూ, ఆడుకుంటున్న కాంగ్రస్ తన వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికే  రాజకీయాల పై వున్నా కాస్తంత గౌరవం పొయింది. ఇక మిగిలింది నాయకులకు దేహ సుద్దే. అది వాల్లచేతుల్లోనే వుంది. కాంగ్రెస్ వైఖరి  కేవలం ఒక్క ప్రాంతం లోనే కాదు యావత్ దేశం లోనే అత్యంత దయనీయంగా వుంది. సాక్షాతూ ప్రధాన మంత్రే ప్రబుత్వంలో అవకతవకలు... అవినీతి జరిగిందని ఒప్పుకున్నారు. ఎలాంటి సమస్యపై స్పందించాల్సి వచ్చిన ఎదురు దాడినే నమ్ముకోవడం కాంగ్రెస్ పార్టీ కి, ఆ నాయకులకు అలవాటుగా మారిపోయింది. 


                                    ఎవరు సెలెక్ట్ చేసారో గాని హస్తం గుర్తుని.... వాడికి హాట్సాఫ్ చెప్పాలి... ఎందుకంటే సంక్షేమం కోసం ఇవ్వాల్సిన అభయ హస్తం కాస్త... సామాన్యుడి నెత్తిపై... బస్మాసుర హస్తాంగా వాడుకుంటున్నారు. ఏది చెయ్యాలన్న...ఎలా చెయ్యాలన్న కాంగ్రెస్ కే సాధ్యం. అధికారం నిలబెట్టు కోవడానికి విలువలకు వలువలు వూదదీయడంలో కొంగ్రెస్ ఈ మధ్య కాలంలో రికార్డు సృష్టిస్తోంది. క్రికెట్లో సచిన్ సెంచరీల రికార్డ్ అయినా బ్రేక్ చేసే వీలుందేమో గాని  కుటిల రాజకీయ జిమ్మిక్కుల్లో కాంగ్రెస్ రికార్డు బ్రేక్ చెయ్యడం ఎవరి తరం కాదని ఆ పార్టీ నిరూపిస్తోంది. 

Thursday, February 17, 2011

ఎక్కడుంది ప్రజాస్వామ్యం....


        ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రజా ప్రతినిధి పై మరో ప్రజా ప్రతినిధి జరిపిన దాడి. అది కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓ గొప్ప ఉద్యమాన్ని నడిపించే నాయకుడి వారసుడి ప్రోద్బలంతో జరిగిన దాడి. ఏమౌతుంది...ఎటువైపు వెళ్తున్నాం. ప్రతి సమస్యకు హింసే మార్గం అనుకుంటే భారతావనికి స్వేచ వచ్చేదా... అసలైన సమస్యను... సమస్యకు కారణం అయినవాళ్ళను వదిలి పెట్టి. తన మనో భావాన్ని చెప్పిన ఓ ప్రజాప్రతినిది పై దాడి చెయ్యడం అమానుషం. వేదిక ఏదైనా సరే మనసులో మాటల్ని... చెప్పే కనీస స్వేచ లేదా...మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా...లేక నియత్రుత్వ పాలనలో ఉన్నామా?  అలా అయితే ఓ ప్రాంత ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలా మాట్లాడుతున్న ఎంతో మంది నాయకుల్ని ఎం చెయ్యాలి... అన్ని ప్రాంత ప్రజలు... ప్రజా ప్రతినిధులు హింసే సరైన మార్గం అనుకుంటే... అలా జరిగితే... ఊహించడానికే భయం వేస్తోంది... 

                             ఈ దాడిని చాలా మంది చాలా రకాలుగా అభివర్నిచొచు ఆధీ వారి వారి ఆలోచన విచక్షణ పై ఆధారపడి వుంటుంది.  కొంత మంది ఎం 
కొట్టావ్ రా బయ్య...ఇంకొంచెం గట్టిగ కొట్టుండాల్సింది...వీ నా కొడుక్కి... అనే ప్రబుదుల్ని ఏమనాలి. ఇలా ఆలోచించే వాళ్ళు మధ్య మనం వున్నామంటే సిగ్గుపడాల....లేక ఆనందించాల... కేవలం ఎదుటివారిపై దాడులు చేస్తేనో... హింసాయుత మార్గంలో వెళ్తేనే ప్రస్తుత సమస్య తీరిపోతుంది అనే భావన చాల ఇబ్బందుల్ని తేచిపెడుతుంది. రాజ్యాంగానికి కట్టుబడాల్సిన ప్రజా ప్రతినిధులే నిస్సుగ్గుగా బజారున పడి పశువుల్లా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. వాళ్లకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు. 

                                    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న పరిస్థితిపై స్పందించాలి. చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్న నేతలు విచక్షణతో వ్యవహరించాలి. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత వహించాలి. 


Tuesday, February 15, 2011

వీడు మోనార్కే....!

    నేను మోనార్క్ ని అంటూ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రకాష్ రాజ్.విలక్షణ నటనతో అందరి దృష్టిని ఆకర్షించడంలో స్పెషలిస్ట్ ప్రకాష్ రాజ్. సినిమా రేంజ్ ని పెంచే నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. కొన్ని సందర్బాలలో తన కాల్ షీట్లు కోసం షూటింగ్ లను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు వున్నాయి. అదీ ప్రకాష్ రాజ్ స్టామిన. ఓ ప్రేక్షకుడిగా కాకుండా...రిపోర్టర్ గా తన గురించి తెలుసుకున్నప్పుడు...ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం తెలిసింది. కాదు... ఆయనే చెప్పాడు.... అది కూడా తనదైన స్టైల్లో.... ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సక్సెస్ ను తన చుట్టూ తిప్పుకుంటా అంటున్నాడు. లో ప్రొఫైల్ తన సక్సెస్ మంత్ర అని తేల్చి చెప్పాడు. పనిని ఇష్ట్ట పడడమే తనకి తెలుసంట్టున్నాడు.
     మీడియాలో  అనవసరంగా కనిపించడం.. నా సినిమా చూడండి అని చెప్పడం... నా ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పడం.... ఎవరికీ తలోంచడం నా లైఫ్ లో చెయ్యను అని తెగేసి చెపుతున్నాడు. అంతే కాదు సక్సెస్ గురించి....సక్సెస్ కోసమే మాట్లాడే ఇండస్ట్రీ. అందుకే సక్సెస్ వస్తే అందరు తన వెంటే వస్తారట... అదే తాను నమ్మిన ఫిలాసఫీ అని చెప్పాడు. ఎవరేమనుకుంటే నా కేంటి... నేనిలానే ఉంటా... నా తీరింతే.... నా రూటే సెపరేటు... అని బాహాటంగానే చెప్పాడు.  చీటికి మాటికి ఎవడి పుట్టిన రోజుకో నేనెందుకు మీడియా ముందు శుభాకాంక్షలు చెప్పాలి. పండక్కి, పబ్బనికి అందరిలా నేను విషెస్ చెప్పను. ఏం చెప్పక పోతే ఆఫర్లు రావా.... పోతే పోనీ... కానీ నేనింతే...అడిగిన ప్రతి ఒక్కడికి జవాబు చెప్పుకుంటూ పోతే...నా రేంజ్ ఏం గాను...నా రేంజ్కి తగ్గే పనుల్ని నేను చెయ్యను. అని తన మనసులో మాటలు ఎన్నింటినో చక చక చెప్పాడు. నేనిలానే వుంటా... కావాలనే వల్లే వస్తారు... లేక పోతే మానేయ్యండి... నేను మోనార్క్ ని. అనే రేంజ్ లో లెక్చర్ ఇచ్చాడు. ఆన్ స్క్రీన్ పై చాలా మంది చాలా డైలాగులు చెబుతారు... కానీ నేను నిజ జీవితంలో కూడా అలానే చెప్పగలనని నిరూపిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఏదేమైనా కొంత వరకు తను కూడా కరక్టే అనిపించింది.