Thursday, February 17, 2011

ఎక్కడుంది ప్రజాస్వామ్యం....


        ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రజా ప్రతినిధి పై మరో ప్రజా ప్రతినిధి జరిపిన దాడి. అది కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఓ గొప్ప ఉద్యమాన్ని నడిపించే నాయకుడి వారసుడి ప్రోద్బలంతో జరిగిన దాడి. ఏమౌతుంది...ఎటువైపు వెళ్తున్నాం. ప్రతి సమస్యకు హింసే మార్గం అనుకుంటే భారతావనికి స్వేచ వచ్చేదా... అసలైన సమస్యను... సమస్యకు కారణం అయినవాళ్ళను వదిలి పెట్టి. తన మనో భావాన్ని చెప్పిన ఓ ప్రజాప్రతినిది పై దాడి చెయ్యడం అమానుషం. వేదిక ఏదైనా సరే మనసులో మాటల్ని... చెప్పే కనీస స్వేచ లేదా...మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా...లేక నియత్రుత్వ పాలనలో ఉన్నామా?  అలా అయితే ఓ ప్రాంత ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలా మాట్లాడుతున్న ఎంతో మంది నాయకుల్ని ఎం చెయ్యాలి... అన్ని ప్రాంత ప్రజలు... ప్రజా ప్రతినిధులు హింసే సరైన మార్గం అనుకుంటే... అలా జరిగితే... ఊహించడానికే భయం వేస్తోంది... 

                             ఈ దాడిని చాలా మంది చాలా రకాలుగా అభివర్నిచొచు ఆధీ వారి వారి ఆలోచన విచక్షణ పై ఆధారపడి వుంటుంది.  కొంత మంది ఎం 
కొట్టావ్ రా బయ్య...ఇంకొంచెం గట్టిగ కొట్టుండాల్సింది...వీ నా కొడుక్కి... అనే ప్రబుదుల్ని ఏమనాలి. ఇలా ఆలోచించే వాళ్ళు మధ్య మనం వున్నామంటే సిగ్గుపడాల....లేక ఆనందించాల... కేవలం ఎదుటివారిపై దాడులు చేస్తేనో... హింసాయుత మార్గంలో వెళ్తేనే ప్రస్తుత సమస్య తీరిపోతుంది అనే భావన చాల ఇబ్బందుల్ని తేచిపెడుతుంది. రాజ్యాంగానికి కట్టుబడాల్సిన ప్రజా ప్రతినిధులే నిస్సుగ్గుగా బజారున పడి పశువుల్లా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. వాళ్లకు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు. 

                                    ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న పరిస్థితిపై స్పందించాలి. చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్న నేతలు విచక్షణతో వ్యవహరించాలి. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత వహించాలి.