Wednesday, April 6, 2011

కింకర్తవ్యం...



      ఏడు పదుల స్వతంత్ర్య భారతావనిలో లెక్కకందని అవినీతి స్కాములు. హవాలా, బోఫోర్స్, హర్షద్ మెహతా స్కామ్, స్టాంపుల కుంభకోణం, పశుదానా కుంభకోణం, టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణం... ఇలా ఎన్నని భరించాలి. ఇంకెన్నింటిని చూడాలి. ఒక్కొక్క స్కాము లెక్కకందని వేల కోట్ల రూపాయలు. దోచుకున్న వాడు దర్జాగా రాజులా తిరగే రాజ్యం మన దేశమంటే అతిశయోక్తి కాదేమో. ఒక్క సారి ఈ స్కాములేవీ జరగకుండా ఉంటే... ఆ డబ్బంతా సమాజాభివృద్ధి కార్యక్రమాలకు కర్చుబెడితే... గడచిన ఏడు దశాబ్దాల్లో ఇండియా అమెరికానే శాశించే స్థాయికి వెళ్లేది. సిగ్గుమాలిన రాజకీయ నాయకుల దౌర్జన్యాలకు, దాష్టికాలకు భారతావని ప్రతిసారి భంగపడుతునే ఉంది. 
                     స్వేచ్చా ఊపిరిలున్న సశ్యశ్యామల భరతమాతను బజారుకీడుస్తున్న రాజకీయ రాబందుల భరతం పట్టాలి. తెల్లారిందా...తిన్నామా... సొల్లు కొట్టామా... పడుకున్నామా... ఇదే జీవితాన్ని ఇంకెన్నాళ్లు గడపుదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎన్నాళ్లు ఎదురుచూద్దాం. ఇంకెన్నాళ్లు అవినీతి ప్రభుత్వాల నీలినీడల్లో బతుకుదాం.ఇంకెన్నాళ్లు చేవ చచ్చిన వాళ్లుగా జీవిద్దాం.

    విజ్ఞతగల ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణం రానే వచ్చింది.         జన్ లోక్్పాల్ బిల్లుకోసం పాటుపడుతోన్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దీక్షకు మద్దతు తెలుపుదాం. చేయి చేయి కలుపుదాం. చరిత్రను తిరగరాద్దాం. భారతీయులుగా భరతమాత బంగరు భవితవ్యానికి పునాదులు వేద్దాం.