Sunday, April 24, 2011

ఓం సాయిరాం.









     కోట్లాదిమంది  ఆరాధ్య దైవం సాయిబాబా. ఆయన నిష్ర్కమణం చాలా బాధాకరం. ఆయన దేవుడా... దైవ స్వరూపమా... ఆయన మంత్రాలతో అందరిని ఆకట్టుకుంటారా... ఏమో ఇవేమీ నాకు తెలీవు.కానీ, ఆయన సామాన్య మనిషి మాత్రం కాదు. మనుషుల్లో గొప్పవాడు. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా  కర్మనా నమ్మిన వ్యక్తిగా నేను భావిస్తాను. ఆయన ప్రభోదించిన సూక్తులు... ఆచరించిన జీవనశైలి, సమాజానికి చేసిన సేవ అద్భుతం.



    కష్టాల్లో ఉన్న వాడిని ఆదుకునే వాడే దేవుడైతే... అనారోగ్యంతో క్షీణిస్తున్నప్పుడు ఆపన్న హస్తం ఇచ్చేవాడే భగవంతుడైతే... పైసా కూడా ఇచ్చుకోలేని నిరుపేదలకు ఉచితంగా సరస్వతీ కటాక్షాన్ని అందించేవాడే దైవాంశసంభూతుడైతే... కచ్చితంగా సాయిబాబా భగవంతుడే. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గానీ, రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చడానికి ఆయన చేసిన భగీరథ ప్రయత్నం గానీ అజరామరం.


               తన జీవితాంతం ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం, అహింసను పంచుతూ వాటిని సమాజంలో పెంచేందుకు బాబా చేసిన కృషి అందరికీ... ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయం. ఆయన జన్మించిన కాలంలో నేను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మరణం ప్రస్తుత సమాజానికి తీరని లోటు.

No comments:

Post a Comment